Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: సిద్ధార్థ రెడ్డి వర్గీయులు టిడిపిలో చేరిక

Nandikotkuru: సిద్ధార్థ రెడ్డి వర్గీయులు టిడిపిలో చేరిక

జమీల్ ఆధ్వర్యంలో టిడిపిలోకి

నందికొట్కూరు పట్టణం ట్యాంక్ ఏరియాకు చెందిన వైసీపీ యువ నాయకుడు సిద్ధార్థ రెడ్డి వర్గానికి చెందిన యువకులు ఇటీవల వైసిపి నుండి టిడిపిలో చేరిన ఎస్ఎండి జమీల్, రసూల్ ఖాన్ ఆధ్వర్యంలో అల్లూరు గ్రామంలో నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మండ్రా శివానందరెడ్డి స్వగృహంలో సిద్ధార్థ రెడ్డి వర్గానికి చెందిన యువకులు రఫీ, వెంకటేష్, షరీఫ్, అబ్దుల్ లతీఫ్, నబి రసూల్, నాగరాజు, హుస్సేన్, లక్ష్మణ్, మాబు సుభాన్ , లింగస్వామి, రమేష్ టిడిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి నేత మాండ్ర శివానందరెడ్డి టిడిపి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లో వైసిపి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతున్న ఆ క్రమంలోనే వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు టిడిపి వైపు చూస్తున్నారని, వైసీపీ జగన్ కు తగిన మూల్యం తప్పదని వారు హెచ్చరించారు. టిడిపి పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని పార్టీలో చేరిన యువకులకు దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News