Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: ఇదంతా ప్రభుత్వం కుట్రే

Nandyala: ఇదంతా ప్రభుత్వం కుట్రే

మాజీమంత్రి భూమా అఖిలప్రియ గత 40 రోజులుగా యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఆళ్ళగడ్డ లో యువగళం పాదయాత్ర విజయవంతం అవుతుందని భయంతోనే ఏవీ సుబ్బారెడ్డి తో కలిసి అధికార పార్టీ పన్నిన కుట్ర అని అన్నారు. గత రెండు రోజుల క్రితం నంద్యాల జిల్లా కేంద్రం లో భూమా అఖిలప్రియ, ఏ.వీ సుబ్బారెడ్డి మధ్య జరిగిన సంఘటన పై ఆళ్ళగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందించారు. కూతురు లాంటి వయసున్న మా అక్క చున్నీ ఏవీ సుబ్బారెడ్డి లాగి దుర్భాశలాడాడు దీంతో కోపోద్రిక్తులైన మా కార్యకర్తలు చేసిన దాడిని మా అక్క ఆపారు. అలాంటిది మా అక్క మీదె కేసు పుటప్ చేసి రిమాండుకు పంపడం భాదాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా ఏవీ సుబ్బారెడ్డి తో కలిసి అధికార పార్టీ పన్నిన కుట్ర అని తెలిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో గత 40 రోజులుగా మా అక్క నారా లోకేష్ తో పాదయాత్ర లో పాల్గొంటుంది, ఆళ్ళగడ్డ లో యువగళం పాదయాత్ర విజయవంతం అవుతుందని భయంతోనే ఇలాంటి కుట్ర పన్నారని ఆళ్ళగడ్డ లో ఎన్ని అడ్డంకులు వచిన పాదయాత్ర విజయవంతం చేసి తీరుతామని భూమా విఖ్యాత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మాజీమంత్రి మీదే ఇలాంటి దుర్గటన జరిగితే మరి సాధారణ మహిళల పరిస్థితి ఎలావుంటుందని టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

రెచ్చగొట్టిన ఏవి పై చర్యలేవి?
తమ అక్క మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఏవి సుబ్బారెడ్డి పై తాము కూడా ఫిర్యాదు చేశామని అయినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News