Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: జై భారత్ సత్యాగ్రహ సభను విజయవంతం చేయండి

Nandyala: జై భారత్ సత్యాగ్రహ సభను విజయవంతం చేయండి

జై భారత్ సత్యాగ్రహ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ముగ్గురు ప్రధానుల వారసుడు రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా తప్పుడు పరువు నష్టం కేసు బనాయించి అన్నారు.పార్లమెంట్ లో అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో విజయవాడ జింఖానా గ్రౌండ్లో జై భారత్ సత్యాగ్రహ సభ జరుగుతుందని, నంద్యాల కాంగ్రెస్ కమిటీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య తెలియజేశారు. ఈ సభలో జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారని, ఈ కార్యక్రమానికి నంద్యాల నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ అనుబంధ సంస్థలైన మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఐ ఎన్ టి యు సి, ఎన్ ఎస్ యు ఐ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్, సేవాదళ్, కిసాన్ సెల్, డాక్టర్ సెల్, సేవాదళ్, మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సమన్వయకర్తలు నంద్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని జై భారత్ సత్యాగ్రహ సభను విజయవంతం చేయవలసిందిగా పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు విజ్ఞప్తిచేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఊకోటూ వాసు, జిల్లా కోశాధికారి ఎస్ వై డి ప్రసాద్, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కరాటే బాలకృష్ణ, మైనారిటీ నాయకులు చాబోలి సలాం, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News