Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: వైఎస్సార్ సెంటినరీలో 'స్పందన' కార్యక్రమం

Nandyala: వైఎస్సార్ సెంటినరీలో ‘స్పందన’ కార్యక్రమం

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ సోమవారం (29-05-23) నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో “స్పందన” కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి మే 29వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News