Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nara Bhuvaneswari: విద్యార్థులు కలలు టిడిపి తోనే సాధ్యం

Nara Bhuvaneswari: విద్యార్థులు కలలు టిడిపి తోనే సాధ్యం

మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఆంద్రా ప్రజలు కలలు నెరవేరుతాయని కలలకు రెక్కలు’ వస్తాయని నారా భువనేశ్వరి అన్నారు. నాదం రోడ్డులో ఉన్న గోపాల ప్లాజా ఫంక్షన్ హాలు నందు నూతన ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కలలకు రెక్కలు వస్తాయి అనే వాల్ పోస్టర్ విడుదల చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా నిజమే గెలుస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపిన వైయస్ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని త్వరలోనే మూలముట సర్దుకొని ఇంటికి పోతారని తెలియజేశారు. అదేవిధంగా ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు కూడా వస్తాయన్నారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్స్ లు నేర్చుకునే విద్యార్ధినులకు ప్రభుత్వ గ్యారెంటీ తో బ్యాంక్ రుణాలు విద్యార్థినులు బ్యాంక్ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా కార్యక్రమం చేపడుతుందని అన్నారు.

- Advertisement -

టీడీపీ – జనసేన ఉమ్మడి ప్రభుత్వం రాగానే కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలియ జేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ.శ్యామ్ కుమార్. ఆదోని ఇంచార్జి మీనాక్షి నాయుడు.మాజీ శాలివాహన చైర్మన్ తుగ్గలి నాగేంద్ర. టిడిపి జిల్లా నాయకులు సాంబశివారెడ్డి. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల తిరుపాల్.బిసి సెల్ రాష్ట్ర అద్యక్షుడు రామనాయుడు. టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్. టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి గుడిసె నరసింహులు. బత్తిన లోకనాథ్.జూటూర్ ఈశ్వరప్ప. విజయ మోహన్ రెడ్డి. నాగేష్. అంజినేయలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News