Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh : నారా లోకేశ్ కోయంబత్తూరు పర్యటన వెనుక పెద్ద ప్లానే!

Nara Lokesh : నారా లోకేశ్ కోయంబత్తూరు పర్యటన వెనుక పెద్ద ప్లానే!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తమిళనాడులోని కోయంబత్తూరు పర్యటన సందర్భంగా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి, వ్యాపారవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో తమిళనాడు బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి, స్థానిక తెలుగు సమాజం లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ స్వాగతం తనను ఎంతగానో ఆనందపరిచిందని లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

- Advertisement -

ALSO READ: OG Movie Updates:ఓజీకి భారీ బీజీఎం: జపాన్ వాయిద్యంతో 117 మంది కళాకారులతో..!

లోకేశ్ తన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని వివరించారు. సింగిల్ విండో అనుమతుల వ్యవస్థ ద్వారా వ్యాపారాల స్థాపన సులభతరం అవుతుందని, పారిశ్రామికవేత్తలకు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల నిర్మాణం నుంచి పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వాయు, జల, రోడ్డు రవాణా సౌకర్యాలు అత్యుత్తమంగా ఉన్నాయని, ఇవి పెట్టుబడులకు అనువైనవని వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్‌గా గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని లోకేశ్ హైలైట్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పరిశ్రమ అనుకూల విధానాలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నాయని, ఇప్పటికే పలు సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలకు గమ్యస్థానంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, వ్యాపారవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక, పారిశ్రామిక రంగంలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో లోకేశ్ చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. కోయంబత్తూరు వంటి పారిశ్రామిక కేంద్రాలతో సంబంధాలు బలపరచడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad