YS Jagan Convoy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల చేపట్టిన పల్నాడు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త విగ్రహాష్కరణ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. అయితే పోలీసులు ఆంక్షలు ఉల్లంఘిస్తూ జగన్ ర్యాలీగా వెళ్లడం చర్చనీయాంశమైంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా బారికేడ్లను పక్కకు నెట్టి పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వచ్చారు.
ఇదిలా ఉంటే ర్యాలీగా వెళ్తున్న జగన్ కాన్వాయ్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందారని.. అయినా కానీ జగన్ తన కాన్వాయ్ ఆపకుండా వెళ్లారని టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్ కాన్వాయ్ ఢీకొట్టలేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగా పోలీసులకు ఓ కీలక వీడియో దొరికింది.
ఈ వీడియోలో జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి సింగయ్య నలిగిపోవడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింగయ్య మృతికి కారణమైన జగన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇక ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. జగన్ పర్యటనలో భాగంగా కొర్రపాడు వద్ద అంబటితో పాటు ఆయన సోదరుడు మురళితో కలిసి బారికేడ్లను తొలగించి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు. అంతేకాకుండా పోలీసులను కూడా నెట్టివేసినట్లు గుర్తించారు. దీంతో అంబటిపై నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
YS Jagan: కారుపై జగన్.. కారు చక్రాల కింద పడి వృద్ధుడు మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES