Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Palle Sindhura Reddy the first lady MLA of Puttaparthi: పుట్టపర్తి...

Palle Sindhura Reddy the first lady MLA of Puttaparthi: పుట్టపర్తి తొలి మహిళా ఎమ్మెల్యే పల్లె సింధూర

పల్లె కుటుంబం చేతుల్లోకే 'పర్తి'

అభివృద్ధి చేసే టీడీపీకే ప్రజలు పట్టం కట్టారని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకున్నారని పల్లె రఘునాథ రెడ్డి వెల్లడించారు. పల్లె సింధూర రెడ్డి విజయానికి కృషి చేసిన టిడిపి, జనసేన, బీజీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరోసారి తమ కుటుంబాన్ని ఆదరించి గెలిపించిన పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి వందనాలు చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

టీడీపీ విజయానికి సైనికుల్లా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ అధికారులకు, పోలీస్, రెవిన్యూ, మిగతా శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన టీడీపీ, జనసేన, బీజీపీ కార్యకర్తలతో పాటు అండగా నిలిచిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు పల్లె సింధూరా రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, టీడీపీ యువ నేత పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News