Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Panyam: దేవాలయాల భూమిపూజలో కాటసాని

Panyam: దేవాలయాల భూమిపూజలో కాటసాని

ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తాం

పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు మండలం సల్కాపురం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయుల దేవాలయం, శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం నిర్మాణం కోసం భూమి పూజలో కాటసాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ మద్దిలేటి మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. ప్రజలకు త్రాగునీటి సమస్య ఉందని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంచినీటి పైప్లైన్ వేయించామని ఆయన తెలియజేశారు. కల్లూరు మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి వస్తే వాటిని పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు తెలియజేశారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో…సల్కాపురం గ్రామ సర్పంచ్ మద్దిలేటి, ఎంపీపీ శారద, కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి, గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులు…రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీనివాసులు, గోపాల్ రెడ్డి, యుగంధర్ గౌడ్, గిడ్డయ్య, సుధాకర్ రెడ్డి, బతుకన్న, గాలన్న, వేణుగోపాల్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News