Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Panyam: సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని

Panyam: సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని

పాణ్యం ఎమ్యెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ పరిధిలో గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్యెల్యే వార్డులోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ, జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో…డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, స్థానిక వార్డ్ కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ & స్టాండింగ్ కమిటీ మెంబర్ సాన శ్రీనివాసులు, కార్పొరేటర్లు…సంగాల సుదర్శన్ రెడ్డి, శ్వేతారెడ్డి, కాశపోగు జయరాముడు, బాల చంద్రారెడ్డి, తిరుపాల్, కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివ శంకర్ రెడ్డి, కర్నూలు డి.ఏ.ఏ.బి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోలు గోపాల్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…ఇలియాస్ అహమ్మద్, భీమ శంకర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, తిరుమలేష్ గౌడ్,పెద్దన్న, 26 వ వార్డులోని వైఎస్సార్ సీపీ నాయకులు…బ్రహ్మానంద రెడ్డి, భాస్కర్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఖాజా, దేవదాసు, నాగ రాజు, మహానంది రెడ్డి, జేమ్స్, శ్రీనివాసులు, రాజేష్, పరశురాం, రమణ, ఖాసీం, రంగ, మల్లి, సౌరయ్య, వినయ్, నరసింహులు, దండు వేణుగోపాల్ రెడ్డి, సాయి, రాజు, రామచంద్రుడు, తెల్లన్న,శేషన్న, సుధాకర్, చంద్ర, సుంకులమ్మ, పద్మ, సత్యమ్మ, మంగమ్మ ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు 67 వ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News