Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాలి

Pathikonda: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాలి

దేశాన్ని, రాష్ట్రాన్ని కాాపాడండి నినాదంతో కమ్యూనిస్టుల యాత్ర

కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ పిలుపునిచ్చారు. దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడండి అనే నినాదంతో సిపిఐ చేపట్టిన బస్సు యాత్ర శనివారం పత్తికొండకు చేరుకున్నదని ఈ సందర్భంగా స్థానిక గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సిపిఐ మండల కార్యదర్శి రాజా సాహెబ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో గుండ్ల కమ్మ ప్రాజెక్టు గేటు కోట్ల రూపాయలు పెట్టి వేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఈ ప్రభుత్వాన్ని నమ్మి రెండు కోట్లకు కాంట్రాక్టు దొరకడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, రాష్ట్రం మీద తొమ్మిది లక్షల కోట్లు చేశారని అన్నారు. ఈనెల 8న తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, పి రామచంద్రయ్య, ఓబులేసు, గంగా భవాని, జగన్నాథం, గిడ్డయ్య ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News