పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం ఆలంకొండ,బొంతిరాళ్ళ, చిట్యాల, కటారుకొండ పత్తికొండ మండలంలో చందోలి గ్రామాలలో హథ్ సే హథ్ జోడో అభియాన్ (చేయి చేయి కలుపుదాం) కార్యక్రమంలో పాల్గొన్నారు పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు బోయ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే పథకాలు, రైతులకు ఆరు లక్షల రూపాయలు వరకు రుణమాఫీ, న్యాయ పథకం, గ్యాస్ సిలిండర్ 500 లకే వంటి పథకాలు తెలియజేస్తూ నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు, అభివృద్ది వివరించినట్టు క్రాంతి తెలిపారు.
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం వారిని రాబోయే రోజుల్లో దేశ ప్రధానమంత్రి అదేవిధంగా ముందుకు వెళ్దామన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, చేస్తున్న మోసాలను ఇంటింటికి వెళ్ళి కరపత్రాల ద్వారా వివరించారు. కేంద్రంలో భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు.