Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: ముగిసిన 'ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి'

Pathikonda: ముగిసిన ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమానికి ప్రజల నుంచి అశేషమైన స్పందన రావడం మంచి పరిణామం అని పత్తికొండ టిడిపి నియోజవర్గం ఇంచార్జ్ కే ఈ శ్యాంబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సామాన్యమైన ప్రజలకు సరైన న్యాయం జరగట్లేదని రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని దుర్మార్గమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తున్నారని కే ఈ శ్యాం బాబు అన్నారు. వైసిపి దుర్మార్గ పాలనలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ముగింపు సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గం లో నిర్వహించిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో నమోదైన ప్రజా సమస్యల నివేదికలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎన్నో సమస్యలు తెలుసుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల కష్టనష్టాలు, బాధలు ఒడిదుడుకులు ఎన్నో విధాలుగా ఎదుర్కొంటున్నారని మాకు వివరించారన్నారు. రాబోయే కాలానికి వైసీపీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తామని ప్రజలంతా ఏక తాటిపై ఉంటామని ప్రజలంతా హామీ ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగట్లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని ప్రజలందరూ గుర్తించే రోజు వచ్చిందని త్వరలోనే వైసీపీ పార్టీని అంతం చేస్తారని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు ఆయన థాంక్స్ చెప్పారు. సీనియర్ నాయకులు తిమ్మయ్య చౌదరితో పాటు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టిఎన్టియుసి గుడిసె నరసింహులు యాదవ్, మండల అధ్యక్షులు తిరుపాల్, గిరిగేట్ల సత్య, మాజీ సర్పంచ్ తిప్పన్న, రవి నాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సోమ్లా నాయక్, రామదాసు హోటల్ రమేష్, ఎద్దులదొడ్డి శీను, విజయ మోహన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News