Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: జగన్ చేతుల మీదుగా రైతుభరోసా కేంద్రం

Pathikonda: జగన్ చేతుల మీదుగా రైతుభరోసా కేంద్రం

ఈనెల 30వ తేదీన వైయస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండ పట్టణంలోని రైతు భరోసాగా కేంద్రాన్ని ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన వెల్లడించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండల కేంద్రంలో వైఎస్సార్ రైతు భరోసా నగదు జమ కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్న సందర్భంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లపై పత్తికొండ ఆర్ అండ్ బి అతిథి గృహంలో సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, వివిధ డివిజన్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News