Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: డోన్ లో నారా లోకేష్ యువగళం

Pathikonda: డోన్ లో నారా లోకేష్ యువగళం

లోకేష్ పాదయాత్ర కు అపూర్వ స్పందన రావడంతో కర్నూల్ జిల్లా టీడీపీలో సరికొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ సందర్బంగా కే ఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ డోన్ నియోజకవర్గానికి చేరుకున్న సందర్బంగా నాయకులో, కార్యకర్తలో కొత్త జోష్ కనపడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. డోన్ నుంచి పత్తికొండ నియోజకవర్గంలో అడుగుపెడుతున్న లోకేష్ పాదయాత్రకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, తండోపతండాలుగా ప్రజలు రావాలని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ప్రజల్లో జగన్ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగడంలేదని ప్రజలు గుర్తించారు. ప్రజలందరూ కలిసి వైసిపి పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా తెలుగుదేశం పార్టీపై బురద జల్లడం ఒక పనిగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. వీటన్నిటిని ప్రజలు గుర్తుపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ని గెలిపించబోతున్నారని పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ కేఈ శాంబాబు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News