Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: 'రైతు భరోసా' కార్యక్రమం విజయవంతం చేయండి

Pathikonda: ‘రైతు భరోసా’ కార్యక్రమం విజయవంతం చేయండి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్తికొండ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో స్థానిక పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ కారం నారాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన పత్తికొండలో మొట్ట మొదటిగా జగన్మోహన్ రెడ్డి నిర్వహించే రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి పత్తికొండపై ఎంతో ప్రేమతో రైతు భరోసా కార్యక్రమాన్ని పత్తికొండలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణదాసు, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, మాజీ సర్పంచ్ సోమశేఖర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బూత్ కన్వీనర్లు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News