Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: వైభవంగా శివరాత్రి జాగరణ

Pathikonda: వైభవంగా శివరాత్రి జాగరణ

భక్తి శ్రద్ధలతో పూజలు

పత్తికొండ పట్టణంలోని తేరు బజార్ లోని వెలిసిన వీరభద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా వీరశైవ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నందికోలు సేవ, కాశీ దర్శన స్వామి విన్యాసాలతో ఆలయం దగ్గర శుక్రవారం రాత్రంతా జాగాహారణ నిర్వహించారు. ఆలయానికి రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పర్వదినాన 12 గంటల సమయాన లింగోద్భవ సమయాన ఆలయ అర్చకులు శివునికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. శనివారం ఆలయంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున స్వామి, సంఘంపెద్దలు, దండి మల్లికార్జున, తుప్పటి నాగన్న, అధ్యక్షులు టైలర్ శేఖర్, ఉపాధ్యక్షులు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి జంగం మంజునాథ్, సంఘం సభ్యులు, భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News