Wednesday, October 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలి

Pathikonda: టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలి

ప్రభుత్వమే టమాటాలు కొనాలన్న జనసేన

టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సి.జి.రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఆద్వరంలో మార్కెట్ యార్డు దగ్గర దర్నా నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి సిజి రాజశేఖర్ టమోట రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించుకోవడంతో టమోటా రైతుల ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందని అన్నారు.

- Advertisement -

ప్రభుత్వమే టమోటాలను కొనాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోతే దశలవారీగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు రాష్ట్రమని హెచ్చరించారు. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మార్పీఎస్ వివిధ ప్రజాసంఘాలు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు, శంకరయ్య.సిసి రంగన్న, రామాంజనేయులు, గోరంట్ల, నరేష్, చంద్ర, సోమన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు పులికొండ గంప నరసింహులు, జనసేన పార్టీ నాయకులు వడ్డే విరేష్, అజయ్, ఆర్కే నాయుడు, నాగరాజ్, రంగస్వామి, ఎర్రి స్వామి, విజయ్ కుమార్, నాగరాజ్, అభిరామ్, రమేష్, ఇస్మాయిల్ తిమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News