Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తే కండువా కప్పారు

Pathikonda: ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తే కండువా కప్పారు

వైసిపి పార్టీలో చేరలేదు, బంధువుల పని నిమిత్తం ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తే మా మెడలో కండువా వేసి, ఫోటో తీసి వైసిపిలో చేరినట్లు సోషల్ మీడియాలో పత్రికలలో కథనాలు ఇచ్చారంటూ కొందరు వాపోవాల్సిన దుస్థితి నెలకొంది. తాము తెలుగుదేశం కార్యకర్తలం అంటూ వైసీపీ పార్టీలో చేరలేదంటూ పత్తికొండ పట్టణం చాకలి విధికి చెందిన చెవుల సూరి, అంజి నరసింహ, విజయ్ లు అన్నారు. టిడిపి కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ సమీప బంధువులు ఎమ్మెల్యేని కలిసినందుకు వెళ్తూ అక్కడే బేల్దారి పనులు చేస్తున్న తమను వెంట రావాలని కోరడంతో 10 మంది వెళ్ళినట్టు వారు వివరించారు.

- Advertisement -

కండువాలు వేస్తుంటే ఇదేంటని ప్రశ్నించామని, ఎమ్మెల్యేను కలిసేటప్పుడు ఇలాంటివి సాధారణమని చెప్పారని వీరంతా వివరించటం విశేషం. అలా ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా, మీడియాలో పెట్టి వైసీపీలోకి చేరిన యువకులంటూ ప్రచారం చేశారన్నారు. తామంతా మొదటి నుంచి టిడిపి కార్యకర్తలం అని ఎప్పటికీ టిడిపి కార్యకర్తల మేనని పనిమీద ఎమ్మెల్యేని కలిసిన వారికి ఇలా కండువాలు వేసి పార్టీలో చేరాలని ప్రచారం చేయడం దారుణం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News