Saturday, March 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: కార్యకర్త హఠాన్మరణంపై పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం

Pawan Kalyan: కార్యకర్త హఠాన్మరణంపై పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం

జనసేన(Janasena) పార్టీ 12వ ఆవిర్భావ దినోవత్సం సభ పిఠాపురంలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఈ సభ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ ఓ కార్యకర్త మృతి చెందడం విషాదం నింపింది. అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అడపా దుర్గాప్రసాద్ ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళ్తూ హఠాన్మరణం చెందినట్లు పార్టీ పేర్కొంది.

- Advertisement -

ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించారు. అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అడపా దుర్గాప్రసాద్ ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళ్తూ హఠాన్మరణం చెందారని తెలిసి చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News