తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం(TDP Formation Day) సందర్భంగా ఆ పార్టీ సభ్యులకు జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీడీపీ శ్రీకారం చుట్టిందని కొనియాడారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగు దేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ. శే శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్కు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కు, నాయకులకు, కార్యకర్తలకు 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ వెల్లడించారు.