జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ప్రస్తుతం తమిళనాడులో ఆయన పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం తంజావూరులోని స్వామిమలై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఉన్నారు.
- Advertisement -
అనంతరం కుంభకోణంలోని ఆదికుంభేశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పలువురు విద్యార్థులు, స్థానికులతో సెల్ఫీ దిగారు. దీంతో వారు కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.