Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Peapully: లోకేష్ పాదయాత్ర కోసం 105 కొబ్బరికాయలు కొట్టిన గండికోట

Peapully: లోకేష్ పాదయాత్ర కోసం 105 కొబ్బరికాయలు కొట్టిన గండికోట

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ప్యాపిలి మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు చేశారు. కలచట్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించి 105 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ది శూన్యమని, ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని, జగన్ రెడ్డిని నమ్మి నట్టేట ముణిగామని ప్రజలంతా వాపోతున్నారని, వైసీపీ పాలనలో దగా పడిన రాష్ట్ర ప్రజలంతా నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారన్నారు. యువగళానికి ప్రజా బలం ఉందని, వైసీపీ నాయకుల కుట్రలను తిప్పి కొట్టి పాదయాత్రను ప్రజలే విజయవంతం చేస్తారని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News