అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రసంగం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ప్రధాని మోదీ(PM Modi)దగ్గరకు పిలిచారు. పవన్ వెళ్లగానే మోదీ తన వద్ద ఉన్న చాక్లెట్ పవన్కు ఇచ్చారు. దీంతో వేదికపై ఉన్న సీఎం చంద్రబాబుతో పాటు ముఖ్యనేతలందరూ నవ్వుకున్నారు. ఆ వెంటనే పవన్ కూడా నవ్వుకుంటూ చాక్లెట్ తీసుకుని నవ్వుకుంటూ వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా పవన్ కళ్యాణ్ అంటే మోదీకి ప్రత్యేకమైన అభిమానం. 2024 సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ మాట్లాడుతూ.. పవన్ను తుఫాన్తో పోల్చిన సంగతి తెలిసిందే. అలాగే ఏ కార్యక్రమంలో పవన్ను కలిసినా ప్రత్యేక ప్రేమ చూపిస్తూ ఉంటారు.