Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: దేశం పట్ల ప్రధాని మోదీ నిబద్ధత స్ఫూర్తిదాయకం: పవన్

Pawan Kalyan: దేశం పట్ల ప్రధాని మోదీ నిబద్ధత స్ఫూర్తిదాయకం: పవన్

Pawan Kalyan| ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రధాని మోదీ(PM Modi)తో ఢిల్లీలో సమావేశమైన సంగతి తెలిసిందే. పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఏపీలో జలజీవన్ మిషన్ అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర పథకాల పొడిగింపు వంటి కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ సమావేశంపై పవన్ కళ్యాణ్‌ స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“ప్రధాని మోదీని నేను మొదటిసారిగా గాంధీనగర్‌లో కలిశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయనతో ప్రతి సమావేశం ఎంతో సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ప్రతి సమావేశం తర్వాత కూడా ఆయన పట్ల ఆరాధనా భావం పెరిగేది. దేశం పట్ల ఆయన ప్రేమ, నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం” అని పవన్ కల్యాణ్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad