Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Crime News:పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..కుటుంబ కలహాలే కారణామా..!

Crime News:పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..కుటుంబ కలహాలే కారణామా..!

Andhra Pradesh Crime: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన గుత్త వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను బలి తీసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనలో అతను మొదట తన పిల్లలను ప్రాణాలు తీయగా, తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

- Advertisement -

ఇద్దరు చిన్నారులను తీసుకొని..

గత వారం రోజులుగా ఈ కేసు ఒక మిస్టరీగా మారింది. పిల్లల ఆచూకీపై కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్లు తన ఇద్దరు చిన్నారులను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. ఈ క్రమంలో అతని కదలికలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ జాతీయ రహదారి మార్గంలో అచ్చంపేట మరియు ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్ నుండి వెల్టూరు వైపు వెళ్తున్న సీసీ కెమెరా దృశ్యాలు బయటకు రావడంతో కేసు మరింత దృష్టిలోకి వచ్చింది.

ఈ ఆధారాలపై పోలీసులు గాలింపు చర్యలు మరింత వేగవంతం చేశారు. గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సీఐ నాగరాజు, ఎస్ఐ విజయభాస్కర్, తిరుపతిరెడ్డి, వందమందికి పైగా సిబ్బంది కలసి ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. అచ్చంపేట పరిధిలోని  గ్రామాలలో వెతికినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరకు ఉప్పునుంతల మండలంలోని సూర్య తండా సమీపంలో పోలీసులు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

పిల్లలను కాల్చి చంపినట్టు..

గుత్త వెంకటేశ్వర్లు తన సొంత పిల్లలను కాల్చి చంపినట్టు గుర్తించారు. ఆ చిన్నారుల మృతదేహాలు అక్కడక్కడా విడివిడిగా పడివుండగా, దాన్ని చూసిన స్థానికులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కన్న తండ్రే ఈ స్థాయిలో దారుణం చేయడం గ్రామస్తులను కుదిపేసింది. మృతదేహాలను గుర్తించిన అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేసి, దర్యాప్తు చేపట్టారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/aadhar-card-local-address-is-enough-greater-rtc-ed-clarifies-on-free-bus-travel-for-women/

సీఐ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ, అచ్చంపేట పోలీసుల సహకారంతో గాలింపు జరిపిన తర్వాత మృతదేహాలను గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. వెంకటేశ్వర్లు తన ఇద్దరు పిల్లలను చంపి తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టమవుతోంది. అయితే దీనికి వెనుక ఉన్న అసలు కారణం కుటుంబ సమస్యలేనా లేక మరేదైనా అనేది ఇంకా స్పష్టతకు రాలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad