HomeTop StoriesAakiveedu: 8 శతాబ్దాలైనా చెక్కుచెదరని విధంగా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం- రఘురామ

Aakiveedu: 8 శతాబ్దాలైనా చెక్కుచెదరని విధంగా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం- రఘురామ

Aakividu Temple Raghurama KrishnaRaju: ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు కీలక ప్రకటన చేశారు. 8 శతాబ్దాలైనా చెక్కుచెదరకుండా ఆలయాన్ని కృష్ణశిలతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కాగా, ఇటీవల ఇదే ఆలయం వద్ద రఘురామ నిరసన ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-satires-on-kcr-for-not-attending-assembly-sessions/

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీరామ మందిరాన్ని అత్యంత వైభవంగా, వందల ఏళ్లయినా చెక్కుచెదరని రీతిలో పునర్నిర్మించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. ఈ ఆలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని.. 1923 నాటి ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉందని రఘురామ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా, సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు.

రాబోయే 8 శతాబ్దాల పాటు ఎటువంటి పగుళ్లు రాకుండా, అత్యంత పటిష్ఠంగా ఈ ఆలయ నిర్మాణం చేపడతామని రఘురామ స్పష్టం చేశారు. అయోధ్య రామమందిర తరహాలోనే నాణ్యమైన రాళ్లతో ఈ నిర్మాణం జరగనుందని చెప్పారు.

Also Read: https://teluguprabha.net/telangana/parental-care-employee-responsibility-bill-introduced-in-telangana-assembly/

కాగా, ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ఆకివీడు రామాలయ సందర్శన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పూజలు నిర్వహించేందుకు రఘురామ వెళ్లగా ఆయన రాకను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. శిథిలావస్థకి చేరిన ఆలయం స్థానంలో గొంతెనమ్మ ఆలయం కట్టాలని డిమాండ్‌ చేశాయి. ఆ కాసేపటికి రామాలయ ఆలయ పునర్నిర్మాణానికి మద్దతు తెలుపుతున్న వర్గం, వ్యతిరేకిస్తున్న దళిత వర్గం పరస్పరం దాడులు చేసుకున్నాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News