Friday, June 20, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Politics: ఏపీ రాజకీయాల్లో "రప్పా.. రప్పా" దుమారం

AP Politics: ఏపీ రాజకీయాల్లో “రప్పా.. రప్పా” దుమారం

AP Politics: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటనల సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్న ప్లకార్డులు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు పుష్ప2 మూవీలోని రప్పా రప్పా నరుకుతాం అనే డైలాగులతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందులో 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు ఒక్కొక్కడి తలలు నరుకుతామనే ప్లకార్డు ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ ప్లకార్డు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై జగన్‌ చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడి రేపింది. సినిమాలో డైలాగ్ చూపించినా తప్పేనా అంటూ వ్యాఖ్యానించారు.

- Advertisement -

జగన్ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నాయకులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. సినిమాల్లో నరుకుంటారని నిజ జీవితంలో కూడా నరుకుతామంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. జగన్ లాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. ఏది పడితే అది మాట్లాడతాం.. ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు.

ఇక పనవ్ కళ్యాణ్‌ జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ​ఆదేశించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయన్నారు. వాటిని ఆచరణలో పెడతాం అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని చెప్పారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించదని హెచ్చరించారు. కచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. అశాంతిని, అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రప్పా రప్పా నరుకుతాం వ్యాఖ్యలను మాజీ సీఎం జగన్‌ సమర్థించడం దారుణమని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫైర్ అయ్యారు. మాజీ సీఎంగా పనిచేసి, ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. రెచ్చగొట్టే, హింసాత్మక వ్యాఖ్యలు సరికాదన్నారు. నరుకుతాం.. చంపుతాం.. దుస్తులు ఊడదీస్తాం అనే వ్యాఖ్యలు మాట్లాడటం ఏంటని షర్మిల నిలదీశారు. మొత్తాని పుష్ప మూవీ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News