Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Free Food : 5 పైసల నాణెం తెస్తే.. రూ.400 భోజనం ఫ్రీ.. ఎక్కడో కాదు...

Free Food : 5 పైసల నాణెం తెస్తే.. రూ.400 భోజనం ఫ్రీ.. ఎక్కడో కాదు మన ఏపీలోనే..

5 పైసల నాణేలు.. 1980-90ల్లో బాగా చలామణీలో ఉండేవి. కాలం గడిచే కొద్దీ 5,10,25,50 పైసల నాణేలు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ నాణేలకు విలువ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏపీలోని ఓ రెస్టారెంట్ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. 5 పైసల కాయిన్ తీసుకొస్తే రూ.400 విలువచేసే శాకాహార భోజనం ఉచితంగా తినొచ్చని పేర్కొంది. ఒకటి రెండు కాదు.. 35 రకాల వంటకాలను రుచిచూడొచ్చని బంపరాఫర్ ఇచ్చింది. ఎక్కడ అనుకుంటున్నారా ?విజయవాడలోని రాజ్ భోగ్ రెస్టారెంట్.

- Advertisement -

కానీ.. ఈరోజుల్లో 5 పైసల కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటాయిలే అనుకుంటే పొరపాటే. ఆ రెస్టారెంటుకు 5 పైసల కాయిన్స్ పట్టుకుని వచ్చిన వారిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా ఆఫర్ పెట్టారో లేదో.. అలా 5 పైసల కాయిన్స్ పట్టుకుని రెస్టారెంటుకు జనాలు ఎగబడ్డారు. ఇంత మంది భోజనం చేసేందుకు వస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంటు యజమాని మీడియాకు తెలిపారు. దాదాపు 300-400 మంది కస్టమర్లు వస్తారని తాము అనుకుంటే 1,000 మంది కంటే ఎక్కువ కస్టమర్లు వచ్చారని చెప్పారు.

మొదట వచ్చిన 50 మందికి మాత్రమే 5 పైసలకు భోజనం అందించామని, మిగతా వారికి సగం ధరకే అంటే.. రూ.200 భోజనం ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఆఫర్ తో తమ రెస్టారెండ్ బాబా ఫేమస్ అయిందంటూ యజమాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ భోజనంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియాల తాలీలను వడ్డించినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News