Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Rudravaram: ఈ స్కూల్ లో అన్నీ డిజిటల్ క్లాసులే

Rudravaram: ఈ స్కూల్ లో అన్నీ డిజిటల్ క్లాసులే

3-10 వ తరగతి వరకు టీవీల్లో క్లాసులు

రుద్రవరం మండల కేంద్రమైన రుద్రవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బారాయుడు తెలిపారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు ప్రభుత్వము డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు 9, ఐఎఫ్ పి, టీవీలను 4, స్మార్ట్ టీవీలను పాఠశాలకు మంజూరు చేశారన్నారు. వీటిని 3 వ తరగతి నుంచి 10, తరగతి చదివి విద్యార్థులకు విద్యా బోధన చేస్తామన్నారు. విద్యార్థులు వీటి ద్వారా బోధన చేయడం ద్వారా వారిలో విజ్ఞానం పెరగడంతో పాటు క్లాసులు వినేందుకు ఉత్సాహము ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో పాఠశాలలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News