Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Rupa Jagadish: పవన్ కళ్యాణ్ ను ముఖ్యమత్రిని చేయడమే లక్ష్యం

Rupa Jagadish: పవన్ కళ్యాణ్ ను ముఖ్యమత్రిని చేయడమే లక్ష్యం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నీ చేయడమే తమ లక్ష్యమని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్దంగా పని చేయాలని ఎమ్మిగనూరు జనసేన పార్టీ నేత,సినీ నిర్మాత ఐ రూపా జగదీష్ అన్నారు. స్థానిక ఎస్ఎంటీ కాలని వద్ద ఉన్న ఐజేకే సొల్యూషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజా పోరాటాలు ,సేవా కార్యక్రమాలు కు ఆకర్షితులై నాదెండ్ల మనోహర్, జిల్లా కన్వీనర్ చింత సురేష్ అధ్వర్యంలో పార్టీ లో చేరినట్లు తెలిపారు. ఎమ్మిగనూరు తాలూకా జనసేన ఇంఛార్జి రేఖాగౌడ్ నా కార్యాలయానికి వచ్చి నన్ను పార్టీలోకి ఆహ్వానించింది. ఎమ్మిగనూరు లో ఫ్రెండ్లీ రాజకీయాలు కొనసాగిస్తానని అన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, బిజేపి ఇంఛార్జి కేఅర్ మురారి రెడ్డి, సీపీఐ సీపీఎం, అప్, బిఎస్పీ నాయకులు అందరితో సాన్నిహితంగా ఉన్నానని అన్నారు. నేను పోలీస్ గా పనిచేసే సమయంలో ప్రజలు తో మంచి సంబంధాలు కొనసాగించాను. అదే తరహాలో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటా అన్నారు.

- Advertisement -

నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. గతంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు.అటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తా. అంతకముందు పొనకలదిన్నె దర్గా ముత్తవల్లి సయ్యద్ ఖాద్రీ భాష మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు తో మిత్రుడు రూపా జగదీష్ అంకిత భావం సేవా కార్యక్రమాలు నచ్చి పార్టీ లో చేరాను. సమన్వయం తో ముందుకు వెళుతూ ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని అన్నారు.

అనంతరం జనసేన చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాదుగుండు శివ అధ్వర్యంలో రూపా జగదీష్,సయ్యద్ ఖాద్రీ భాష లను సన్మానించారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు బీసీ నాగరాజు, టైలర్ బాబు , గాజుల వెంకటేష్, ఎంఎస్ నగర్ శివ, కే తిమ్మాపురం మంజునాథ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News