Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa Chakrapani Reddy: జగన్ వల్లే అందరికీ సంక్షేమ పథకాలు

Shilpa Chakrapani Reddy: జగన్ వల్లే అందరికీ సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. 21, 22 వార్డుల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప వాటిలోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఎవరైనా అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, నేడు ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ జగన్ ను ఆదరిస్తున్నారని వారి ఆదరణ వల్ల తిరిగి రాబోయేది జగనన్న ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఎమ్మార్వో ప్రకాష్ బాబు, కో ఆప్షన్ సభ్యులు రషీద్, వైసిపి పట్టణ అధ్యక్షులు సయ్యద్మీర్, కౌన్సిలర్లు ప్రకాష్, సుల్తాన్, సచివాలయ సిబ్బంది, నాయకులు పువ్వాడి భాస్కర్ , రాముడు, మొహంతుల్లా, వార్డు వాలంటీర్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News