Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa Ravichandra Kishore: ప్రజల గుండెల్లో నిలిచిపోయే సంక్షేమ పథకాలు

Shilpa Ravichandra Kishore: ప్రజల గుండెల్లో నిలిచిపోయే సంక్షేమ పథకాలు

గడప గడపకులో ఎమ్మెల్యే

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డు బుడగ జంగాల కాలనీలో 141 గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వార్డు ఇంచార్జ్ కౌన్సిలర్ సావిత్రమ్మ, వైసీపీ నాయకులు ఎమ్మెల్యే శిల్పారావ్ చంద్ర కిషోర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

అనంతరం లబ్ధిదారులను ఆప్యాయంగా ప్రలకరిస్తూ సంక్షేమ పథకాల కరపత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని తెలుగుదేశం నాయకులు జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పరిపాలన సాగిస్తున్న జగనన్నకు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వచ్చే 2024 ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విజయకేతనం ఎగురవేస్తారని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News