Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Alluri District : ఘోర రోడ్డుప్రమాదం.. అతివేగానికి ఆరుగురు బలి

Alluri District : ఘోర రోడ్డుప్రమాదం.. అతివేగానికి ఆరుగురు బలి

అతివేగం ఆరుగురిని బలితీసుకుంది. ఏపీలోని అల్లూరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద లారీ-కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెంది చెందారు. బాధితులంతా ఛత్తీస్ గఢ్ కు చెందిన వారుగా తెలుస్తోంది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఆ కారులో ఉన్న మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News