Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Sridevamma: 4 కుటుంబాలకు 28 లక్షల రూపాయల చెక్కులు

Sridevamma: 4 కుటుంబాలకు 28 లక్షల రూపాయల చెక్కులు

7 లక్షల రూపాయల వైయస్సార్ భరోసా చెక్కుల పంపిణీ

పత్తికొండ నియోజకవర్గం పరిధిలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నలుగురు రైతు కుటుంబాలకు 28 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అందజేశారు. స్థానిక వైయస్సార్ పార్టీ కార్యాలయం ఆవరణంలో చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం దేవనకొండ గ్రామానికి చెందిన శేషి రెడ్డి, తుగ్గిలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన వడ్డే ఆంజనేయులు, వెల్దుర్తి మండలం చెరుకులపాడుకు చెందిన నేసే బాలస్వామి, క్రిష్ణగిరి మండలం క్రిష్ణగిరి చెందిన పురుషోత్తం రెడ్డి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయల వైయస్సార్ భరోసా చెక్కులను ఎమ్మెల్యే శ్రీదేవమ్మ వ్యవసాయ అధికారులతో కలిసి అందజేశారు. రైతులకు చిన్న కష్టం వచ్చినా ప్రభుత్వం కచ్చితంగా స్పందించి వెంటనే ఆదుకుంటుందని, క్షణికావేశానికి లోనై కుటుంబాలను దూరం చేసుకోవద్దని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు పత్తికొండ మండలం ఎంపీపీ నారాయణదాసు, మండల కన్వీనర్ కారం నాగరాజు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News