Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Srikakulam: మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన

Srikakulam: మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన

మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.  ఉత్తరాంధ్ర ప్రజలకు కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈ కల నేటితో ఓ రూపం సంతరించుకుంది.  నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం శంకుస్థాపన చేసే కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు తరలివచ్చారు.  ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు.

- Advertisement -

శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్ధాపనలు చేసిన జగన్, సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేశారు. గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News