Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్YSRCP leader murder : వైసీపీ నేత దారుణ హత్య.. రాజకీయ కక్షలా ?

YSRCP leader murder : వైసీపీ నేత దారుణ హత్య.. రాజకీయ కక్షలా ?

ఏపీలో ఓ వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అధికారపార్టీకి చెందిన నేతను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కత్తితో పొడిచి చంపారు. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషును శ్రీకూర్మం గ్యాస్ గోడౌన్ సమీపంలో దుండగులు కత్తితో నరికి చంపారు. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. తొలుత ఇది దొంగల పనిగా భావించారు.

- Advertisement -

కానీ.. మృతుడి సెల్ఫోన్, ఒంటిపై బంగారం, డబ్బు ఏవీ చోరీకి గురికాలేదని గుర్తుంచారు. ఈ నేపథ్యంలో రామశేషు హత్యకు కారణం ప్రశ్నార్థకమైంది. రాజకీయ కక్షలు, లేదా వ్యక్తిగత కక్షల నేపథ్యంలో రామశేషును హత్యచేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పక్కనే ఉన్న పొలాల్లో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని.. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, వివాహేతర సంబంధం, కుటుంబ, రాజకీయ గొడవలు కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News