Sunday, September 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శిఖరం వద్ద ఎలుగుబంటి సంచారం

Srisailam: శిఖరం వద్ద ఎలుగుబంటి సంచారం

శ్రీశైలంలోని శిఖరం వద్ద గత కొద్ది రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తోందని భక్తులు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భక్తులు శిఖర దర్శనానికి వెళ్లే మెట్ల వద్ద, ఇష్టకామేశ్వరి టెంపుల్ వెళ్లడానికి టికెట్లు ఇచ్చే కౌంటర్ వద్ద ఈ ఎలుగుబంటి సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు.  ప్రతిరోజు రాత్రిపూట తెల్లవారుజామున ఈ ఎలుగుబంటి సంచరించి భక్తులకు భయాందోళన కలిగిస్తుందని భక్తుల వాపోతున్నారు. తక్షణమే సంబంధిత ఫారెస్ట్ అధికారులు దేవస్థానం అధికారులు కలిసి ఎటువంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగక ముందే ఎలుగుబంటి జనసంచారంలోకి రాకుండా తగు చర్యలు చేపడితే బాగుంటుందని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News