Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: కనుమ సందర్భంగా గోపూజా మహోత్సవం

Srisailam: కనుమ సందర్భంగా గోపూజా మహోత్సవం

శ్రీశైల మహాక్షేత్రంలో కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం గోపూజా మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణములోని శ్రీ గోకులం, దేవస్థానం గో సంరక్షణశాలలోనూ ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతఃకాల సమయంలో ‘నిత్యసేవ’గా గోపూజ నిర్వహించబడుతున్నప్పటికీ, కనుమ పండుగ సందర్భంగా ఈ రోజు నిత్య గోసేవతో పాటు విశేషంగా గోపూజ చేశారు. అనంతరం శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తరమంత్రంతోనూ, గోవులకు షోడశోపచారాలతో పూజాదికాలు చేశారు. గోవు సకల దేవతలకు ఆవాసస్థానం కావడం చేత గోవును పూజించడం వలన దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని అర్చకస్వాములు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News