Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: 'శ్రీశైల వైభవం' లైట్స్ & సౌండ్ షో ప్రారంభం

Srisailam: ‘శ్రీశైల వైభవం’ లైట్స్ & సౌండ్ షో ప్రారంభం

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను వైభవాన్ని కళ్లకు కట్టేలా లైట్స్ అండ్ సౌండ్ షో ప్రారంభమైంది. శ్రీశైలంలోని ఆలయ నాగుల కట్ట వద్ద ఈ లైట్స్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ‘ప్రసాద్ స్కీమ్’ లో భాగంగా దేవస్థానం చేపట్టిన లైట్ అండ్ సౌండ్స్ షో చూడాలంటే రూ. 50 చెల్లించాలి. తొలిసారి ఏర్పాటు చేసిన ఈ లైట్ అండ్ సౌండ్స్ షోకు భక్తుల నుండి అనూహ్య స్పందన రావటం విశేషం. మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ షోను ప్రారంభించారు. భక్తులతో పాటు మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా లైట్ అండ్ సౌండ్స్ షో వీక్షించారు. తొలి రోజే..ఈ షోకు సుమారు 100 మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ఆలయం వెనుక భాగంలోని కౌంటర్ వద్ద ఈ షో కోసం టికెట్లు లభిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News