Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం

Srisailam: వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి . ఈనెల 23 వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు, వేదపండితులు, ఆలయ ఈవో ఎస్.లవన్న దంపతులు ఘనంగా ప్రారంభించారు. అర్చకులు వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణ ధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం.. వివిధ విశేష పూజలు నిర్వహించి ఉగాది మహోత్సవాకు వైభవంగా శ్రీకారం చుట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News