Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: ఘనంగా వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు

Srisailam: ఘనంగా వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు

శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలో మూడో విడత ఆసరా  కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.  ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి పూలబాటతో ఘన స్వాగతం పలికారు స్థానిక మహిళలు. ఇచ్చిన హామీలు 99 శాతం పూర్తి చేసిన ఘనత మన వైయస్సార్ ప్రభుత్వానిదేనంటూ ఎమ్మెల్యే శిల్పా వెల్లడించారు. 

- Advertisement -

వైయస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా శ్రీశైలం మండలానికి సంబంధించి 334 సహాయక సంఘాలకు 1,79,55,932, ఒక కోటి డెబ్భై తొమ్మిది లక్షల యాబై ఐదు వేల  తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలను చెక్కును పంపిణీ చేశారు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. అనంతరం ఆసరా వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పొదుపు సంఘాల మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శిల్పాకు మహిళలు మంగళ హారతులు పట్టి ఆనందోత్సాహాల నడుమ ఆసరా వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో ఎమ్మెల్యే గారు  మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మహిళా అభ్యున్నతి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో రెండు అడుగులు ముందుకు వేసి  మహిళలకు అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చుతున్నారని కొనియాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా వెలుగొందుతున్నారన్నారు. పాదయాత్రలో చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఆదర్శ ముఖ్యమంత్రిగా  కొనియాడ బడుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News