మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి కర్నూలు నగరంలోని తుంగభద్ర నదీ తీరాన ప్రతిష్ట చేస్తున్న 56 అడుగుల మట్టి విగ్రహ ఏర్పాట్లను పరిశీలించి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే కర్నూల్ నగరం మత సమరస్యానికి పెట్టింది పేరని, 56 అడుగుల మట్టి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు సంయుక్తంగా అన్ని పండుగలు జరుపుకోవడం కర్నూల్ ప్రత్యేకతని కొనియాడారు. 11 రోజులు పూజలు అందుకొని గణనాధుడు ఇక్కడే నిమజ్జనం చేయడం ఇక్కడి ప్రత్యేకత అని కొనియాడారు. ఇంతటి గొప్ప కార్యక్రమంను నిర్వహిస్తున్న కళ్యాణ్, అతని మిత్ర బృందంను అభినందించిన ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/99d4241f-6c85-4367-b43e-8a15af2e3c69-680x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/b41820e1-d3c5-4198-a32c-7d51acf078b1-1024x680.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/e9da2c2a-8e51-401d-bc4b-d0dc436eb5ca-680x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/f3e35263-3ece-4085-b8d7-c0ac16d29394-1024x680.jpg)