Saturday, December 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Kasinayana: కాశీనాయన ఆలయ అంశంపై కేంద్ర మంత్రి భూపేంద్రని కలిసిన టీడీపీ నాయకులు రితేష్ రెడ్డి

Kasinayana: కాశీనాయన ఆలయ అంశంపై కేంద్ర మంత్రి భూపేంద్రని కలిసిన టీడీపీ నాయకులు రితేష్ రెడ్డి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు హెచ్ఆర్డీఏ మంత్రి నారా లోకేష్ సూచనలతో టీడీపీ బద్వేల్ సమన్వయకర్త రితేష్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఇటీవల జరిగిన కాశీనాయన(Kasinayana) ఆలయ నిర్మాణాల కూల్చివేత ఘటన గురించి రితేష్ రెడ్డి గారు కేంద్ర మంత్రికి వివరించి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతులు ఇచ్చి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆలయ సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, సానుకూలంగా స్పందించి త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని టిడిపి బద్వేల్ సమన్వయకర్త రితేష్ రెడ్డికి తెలిపారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త భూపేష్ రెడ్డి , శశిభూషణ్ రెడ్డి , సింగారెడ్డి మరియు RSS మరియు VHP పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News