మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన నిజం వెల్లడించబోతున్నట్లు వైసీపీ(YCP) ట్వీట్ చేసింది. “ఇవాళ రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం. అతిపెద్ద రహస్యం బయటపడనుంది” అని తెలిపింది. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదుదారుడు సత్వవర్ధన్ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విజయవాడ జైలులో వంశీతో ములాఖత్ అయ్యారు.
YCP: రాత్రి 7 గంటలకు సంచలన నిజం.. వైసీపీ ట్వీట్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES