Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Thoguru Arther: నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ కాంతులు-ఎమ్మెల్యే

Thoguru Arther: నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ కాంతులు-ఎమ్మెల్యే

గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారిని పలకరించిన ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ప్రతి ఇంటిలో సంక్షేమ కాంతులు వేద జల్లుతున్నాయని ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ అన్నారు. మండ్లెం గ్రామంలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండ్లెం గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారిని పలకరించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నాలుగేళ్లలో ఆయా కుటుంబాలకు అందించిన సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుని వారికి ఏమైనా సమస్య ఉంటే వాటిని సైతం కనుక్కొని వాటి పరిష్కారానికి వారి ముంగిటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

అంగన్వాడి సెంటర్, ఉర్దూ స్కూల్ సందర్శించడం సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు . కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటరీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News