Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Thoguru Arther: సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ప్రేమ, అభిమానం తగ్గలేదు

Thoguru Arther: సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ప్రేమ, అభిమానం తగ్గలేదు

ప్రజల్లో కలియతిరిగిన ఎమ్మెల్యే

నాలుగు సంవత్సరాలు దాటిన వైసీపీ ప్రభుత్వ పాలనలో సీఎం జగనన్న నాయకత్వంపై ప్రజల ఆధార అభిమానాలు నేటికి తగ్గలేదని ప్రజల వద్దకు గడపగడపకు వెళ్ళినప్పుడు ప్రజలు చూపుతున్న జగన్ పై చూపుతున్న అభిమానాలే అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే తోగుర్ ఆర్థర్ అన్నారు. నందికొట్కూరు నియోజవర్గ పరిధిలోని పగిడ్యాల మండల కేంద్రంలో సచివాలయం 1 పరిధిలో రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్థర్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అర్థర్ ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ ఫలాలను చదివి వారికి వినిపిస్తూ ముందుకు సాగారు. అందిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజా సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. నవరత్న పథకాల పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ కృషిని ప్రజలకు వివరిస్తూ మరోసారి సీఎం జగనన్న పై మీ ఆశీర్వాదం ఉండాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలోరూరల్ సీఐ విజయభాస్కర్, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి, ఇంచార్జ్ తాసిల్దార్ ప్రకాష్ రావు, మండల అభివృద్ధి అధికారి వెంకటరమణ, ఎస్సై నాగార్జున, వైసిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సగినెల వెంకటరమణ, వైసీపీ నాయకులు జయరామిరెడ్డి, ఉదయ్ కిరణ్ రెడ్డి, సంకిరేణి పల్లె సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, పాలమర్రి జీవన్ సుందర్రాజు, పాములపాడు వైసిపి నాయకులు ముడియాల వెంకట రమణారెడ్డి, బ్రాహ్మణ కొట్కూర్ హరి సర్వోత్తమ్ రెడ్డి, రఘు రెడ్డి,నందికొట్కూరు పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ, తిరుపాలు, శ్రీనాథ్ రెడ్డి, వైపాలెం ఇనాయాతుల్లా, పీర్ సాహెబ్ పేట శేఖర్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News