Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Thota Chandrasekhar: దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం

Thota Chandrasekhar: దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం

సమస్యలు గాలికొదిలేసి ప్రజల దృష్టి మరల్చేలా..

ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్న సిఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం దగా పడిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. హైదరాబాద్లోని ఎపి BRS క్యాంప్ కార్యాలయంలో గుంటూరు జిల్లాకి చెందిన మహబూబ్ బాషా ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాకి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రచార ఆర్భాటాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని దుయ్యబట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని వైసిపి ప్రజాప్రతినిధుల్ని ప్రజలు తరిమికొడుతున్నారని స్పష్టం చేశారు. సిఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో అన్నీ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యారని ఆరోపించారు . ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ ను సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ది ఎపిలో జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. తొలుత అనంతపురానికి చెందిన ఎండి రహమతుల్లా, అలీ అహ్మద్, ఎండి ఇబ్రహీం, న్యాయవాది ఎండి ముజాఫర్ సమి, నిరసనమెట్ల శ్రీనాథ్, మహ్మద్ హమద్, కురుబ నాగరాజు, సమత ఖాన్, ఎండి సాజిద్ షా, ఎండి మిరాజ్, మొహమ్మద్ ఇర్ఫాన్, ఫిరోజ్ ఖాన్ షేక్ అహ్మద్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లాం ప్రకాష్, నరసరావుపేటకు చెందిన దేవసహాయం సహా పలు జిల్లాలకి చెందిన నాయకులు బిఆర్ఎస్ లో చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News