కోట్లాది మంది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో అన్యమత ప్రచారం కొన్నేళ్లుగా సాగుతున్న సంగతి తెలిసిందే. టీటీడీ(TTD)కి చెందిన సంస్థల్లో అన్యమతాలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగులు కొండపై అన్యమతం ప్రచారానికి సహకరిస్తున్నారు. దీని వల్ల తిరుమల క్షేత్రం పవిత్ర దెబ్బ తింటుందని భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొండపై మాంసాహారం, గంజాయి, మద్యం దొరుకుతుండటంపై కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది.
టీటీడీలో సంస్కరణలు మొదలు పెట్టింది. అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి ఓ జాబితాను రూపొందించింది. వీరిలో టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ఉన్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) గుర్తించారు. దీంతో ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాజాగా అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. టీటీడీ మహిళ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, టీటీడీ అనుబంధ విద్యాసంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు కలిపి 18 మందిని బదిలీ చేశారు.