Sunday, February 23, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirupathi: ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సుభాష్

Tirupathi: ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సుభాష్

మళ్లీ వస్తా

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి. సుభాష్ ప్రకటించారు. ఆయన బుధవారం మధ్యాహ్నం తిరుపతి కార్మిక రాజ్య బీమా (ఈ. ఎస్. ఐ )ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ బ్లాక్, అత్యవసర విభాగం, ఓ. పి. రిజిస్ట్రేషన్ విభాగం, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. గత సంవత్సరం నవంబర్ లో ఆసుపత్రి సందర్శనకు వచ్చినప్పుడు ఉన్న అవుట్ పేషెంట్స్ నమోదు సంఖ్య 150 నుండి ప్రస్తుతం 350 వరకు పెరగడంపై, ఇన్ పేషెంట్స్ అడ్మిషన్స్ సంఖ్య 30 నుండి 53 వరకు పెరగడంపై కూడా సంతృప్తి వ్యక్త పరిచారు.

- Advertisement -

సూపరింటెండెంట్ కు సన్మానం

పేషెంట్స్ కు గత 5 ఏళ్లుగా సక్రమంగా లేని ల్యాబ్ కిట్స్, రీ ఏజెంట్స్, ఇతర పరికరాలను సుమారు 5 లక్షల తన సొంత ఖర్చుతో సమకూర్చడంపై, ఇతర సేవలు సమకూరడంపై ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. ఎం. శ్యాంబాబును అభినందిస్తూ శాలువతో సన్మానం చేశారు. రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రులు, డిస్పెన్సరీలు తిరుపతి ఆసుపత్రిని ఆదర్శంగా తీసుకొని సిబ్బంది పనిచేస్తూ కార్మికులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి వాసంశెట్టి. సుభాష్ పిలుపు నిచ్చారు.

మరికొన్ని రోజుల్లో స్విమ్స్

గత ఆరు సంవత్సరాలకు పైగా రాయలసీమ, నెల్లూరు లాంటి జిల్లాల ఈ. ఎస్. ఐ. కార్మికులకు అందని ద్రాక్షగా ఉన్న తిరుపతి స్విమ్స్ (SVIMS) ఆసుపత్రి సెకండరీ, టెరిషరీ రేఫరల్ వైద్య సేవలు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొంటూ, ఇందుకు ప్రత్యేక కృషి చేసిన రాష్ట్ర బీమా వైద్య శాఖ డైరెక్టర్ వి. ఆంజినేయులు, ఈ. ఎస్. ఐ. కార్పొరేషన్ సంస్థ విజయవాడ రీజినల్ డైరెక్టర్ , తిరుపతి ప్రాంతీయ అధికారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఈ. ఎస్. ఐ. ఆసుపత్రులలో కార్మికులకు మెరుగైన ల్యాబ్ సర్వీస్ లు, ఇన్ పేషెంట్స్ సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు మంత్రి సుభాష్ పేర్కొన్నారు.

పోస్టుల భర్తీకి

రాష్ట్ర బీమా వైద్య శాఖలో గత 15 ఏళ్లుగా భర్తీకి నోచుకోని నర్సింగ్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకొంటున్నట్టు ఆయన చెప్పారు. ESI లో ఎటువంటి అలసత్వంను సహించమని, అలాగే కష్టపడి సంస్థ అభివృద్ధి చేసేవారిని మరిచేది లేదని ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి నావైపు నుండి అన్నీ తొందరలో సమకూర్చి మళ్ళీ కలుస్తానని చెప్పారు. ఈ తనిఖీలో మంత్రి వెంట ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. ఎం. శ్యాంబాబు, సి. ఎస్. ఆర్. ఎం. ఓ. డాక్టర్. AVS ప్రసాద్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News